Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో దాదాపు 280 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

CM Jagan is deeply shocked over the Odisha train accident
ఒడిశా(Odisha)లోని బాలాసోర్(Balasore) సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు(Coromandel Express train ) ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్(CM Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో దాదాపు 280 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు.
