ముఖ్యమంత్రి జగన్‌(CM Jagan) అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో మంత్రిమండలి(Ministry) కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ భేటీలో మొత్తం 45 అంశాలపై చర్చించారు. మిచాంగ్ తుపాను(Typhoon Michong) బాధితులకు నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పెన్షన్‌(Pension) రూ. 3 వేలకు పెంపు నిర్ణయానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. యాంటి నక్సల్ ఆపరేషన్‌లో పని చేసే వారికి 15 శాతం అలవెన్స్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ముఖ్యమంత్రి జగన్‌(CM Jagan) అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో మంత్రిమండలి(Ministry) కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ భేటీలో మొత్తం 45 అంశాలపై చర్చించారు. మిచాంగ్ తుపాను(Typhoon Michong) బాధితులకు నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పెన్షన్‌(Pension) రూ. 3 వేలకు పెంపు నిర్ణయానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. యాంటి నక్సల్ ఆపరేషన్‌లో పని చేసే వారికి 15 శాతం అలవెన్స్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోర్టులలో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్(DADR) చెల్లింపులపై కేబినెట్‌‌‌లో చర్చించారు. యాభై ఎకరాల లోపు ఉన్న 110 భూ కేటాయింపులను ఏపీఐఐసీకి కేటాయింపుపై చర్చ జరిగింది.

ఏపీ స్టేట్ సీసీ టీవీ సర్వైవలెన్స్(AP CC survaivalence) ప్రాజెక్ట్‌కి రూ.552 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడంపై కూడా చర్చించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటు ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ‘ఆడుదాం ఆంధ్ర’పై కేబినెట్‌లో చర్చించారు. సాధారణ ఎన్నికల నిర్వహణకు 982 తాత్కాలిక పోస్టులు అదనంగా క్రియేట్ చేయడంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. సీఐడీ(CID) ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి విజయవాడ లోని రాయనపాడులో 20 సెంట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జగన్న శాశ్వత భు హక్కు, భూ రక్ష పథకం కోసం కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంపు నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఆరోగ్య శ్రీ చికిత్స మొత్తం పరిమితి రూ.25 లక్షలకు పెంపునకు ఆమోదం తెలిపారు. జనవరిలో చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల అమలుకు ఆమోదం తో పాటు జనవరిలో ప్రారంభమయ్యే జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమానికి ఆమోదం తెలిపారు. మిచాంగ్ తుపాను పరిహారం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్, విశాఖలో ఓ ప్రైవేటు విద్యాసంస్థకు 11 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు నిర్ణయానికి ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పజతకం అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.

రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీల్లో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల ఏర్పాటు, సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపారు. కోర్టుల సిబ్బంది, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపులపై చర్చ జరిగింది. యాంటీ నక్సల్ ఆపరేషన్లలో పాల్గొనే వారికి 15 శాతం భృతి పెంపు నిర్ణయానికి ఆమోదం తెలిపారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలపై నిర్ణయం తీసుకున్నారు.

Updated On 15 Dec 2023 7:35 AM GMT
Ehatv

Ehatv

Next Story