అమరావతి రాజధాని ప్రాంతంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. గురువారం తన నివాసం నుండి ఉదయం 11 గంటలకు పర్యటనకు బయలుదేరుతారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి సీఎం పర్యటనను ప్రారంభించనున్నారు.

అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుండి సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయ మూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలు పెట్టిన సైట్ లను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతారు.

Updated On 20 Jun 2024 5:02 AM GMT
Eha Tv

Eha Tv

Next Story