ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళ్ల‌నున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

రేపు ఉదయం 10.00 గంటలకు ఉండవల్లి నివాసం నుండి సీఎం చంద్ర‌బాబు పర్యటనకు బయలుదేరుతారు. 11.20-11.50 వరకు అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం 12.35-01.30 వరకు భోగాపురం ఎయిర్ పోర్టును సందర్శిస్తారు. అనంతరం ఎయిర్ పోర్టు పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షిస్తారు. త‌ర్వాత 02.30-04.30 వరకు వర్చువల్ గా సీఐఐ కాన్ఫరెన్సులో పాల్గొంటారు. అనంతరం మెడ్ టెక్ జోన్ వర్కర్లతో సమావేశమవుతారు

సాయంత్రం 04.50-06.00 విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై గత ఐదేళ్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తారు. 07.45 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

Updated On 10 July 2024 3:28 AM GMT
Eha Tv

Eha Tv

Next Story