గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి కార్యక్రమం ఇదే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రారంభించారు. పెనుమాకలో అర్హులకు వాళ్ల ఇళ్ల వద్దే పింఛన్ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌లు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్దిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేయ‌నుంది. ఇందులో భాగంగా స్వయంగా సీఎం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.

Eha Tv

Eha Tv

Next Story