హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో వైఎస్‌ఆర్‌సీపీ చిత్తూరు

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు నియోజకవర్గం ఇన్చార్జిగా విజయానందరెడ్డిని వైసీపీ అధినాయకత్వం ఇటీవలే నియమించింది. అప్పటినుంచే ఆరణి శ్రీనివాసులు అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీ మారతారన్న ప్రచారం సాగుతూ ఉండగా.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిశారు.

హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో వైఎస్‌ఆర్‌సీపీ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమావేశమయ్యారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించడంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వర్గం గుర్రుగా ఉంది. ఇక శ్రీనివాసులు త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Updated On 3 March 2024 10:03 AM GMT
Yagnik

Yagnik

Next Story