Chief Minister's Secretary : పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రి కార్యదర్శి
ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కె.ధనంజయ రెడ్డి శుక్రవారం పదవీ విరమణ చేశారు. కలెక్టర్గా, వ్యవసాయశాఖతో పాటు పలుశాఖల్లో సేవలందించిన ధనంజయ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
![Chief Ministers Secretary K Dhananjaya Reddy has retired Chief Ministers Secretary K Dhananjaya Reddy has retired](https://s3.ap-south-1.amazonaws.com/media.ehatv.com/wp-content/uploads/2024/06/Chief-Ministers-Secretary-K-Dhananjaya-Reddy-has-retired.jpg)
Chief Minister’s Secretary K Dhananjaya Reddy has retired
ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కె.ధనంజయ రెడ్డి శుక్రవారం పదవీ విరమణ చేశారు. కలెక్టర్గా, వ్యవసాయశాఖతో పాటు పలుశాఖల్లో సేవలందించిన ధనంజయ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఆయన రిటైర్మెంట్ సందర్బంగా విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు ధనంజయరెడ్డి దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ధనంజయరెడ్డి సేవలను పలువులు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాలరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, అటవీ పర్యావరణశాఖ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, రెవెన్యూ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ప్రభుత్వ ప్రిన్సిపల్ అడ్వైజర్ అజేయ కల్లాం, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ మధుసూదన్ రెడ్డి, ఐ ఎండ్ పీఆర్ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డితో పాటు పలువురు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
![Yagnik Yagnik](/images/authorplaceholder.jpg)