చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని

మరో వైసీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని పోటీ చేయగా.. వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బరిలోకి దిగారు. మోహిత్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే పోలింగ్ అనంతరం, తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన పులివర్తి నానిపై దాడి జరగడం సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై హత్యాయత్నం సెక్షన్లతో కేసు నమోదు చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. తిరుపతి పోలీసులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మోహిత్ రెడ్డి ఈ కేసులో 37వ నిందితుడిగా ఉన్నారు.


Eha Tv

Eha Tv

Next Story