తిరుపతి(Tirupati) జిల్లా సత్యవేడు(Satyavedu) ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై(K Adimulam) ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

తిరుపతి(Tirupati) జిల్లా సత్యవేడు(Satyavedu) ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై(K Adimulam) ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ మహిళ ఆరోపించారు. పైగా ఆ వీడియో వైరల్‌ కూడా అయ్యింది. ఆమె ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు(Chandrababu) ఓ లేఖ కూడా రాశారు. ఎమ్మెల్యే వేధింపులను పెన్‌ కెమెరాలో రికార్డు చేసినట్లు ఆమె తెలిపారు. రాత్రి వేళల్లో మెసేజ్‌లు పంపి వేధించారని లేఖలో పేర్కొన్నారు. తిరుపతిలోని భీమాస్‌ ప్యారడైజ్‌ హోటల్‌కు పిలిపించి వేధించారని ఆరోపించారు. అయితే ఈ సంఘటనను తెలుగుదేశంపార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

Eha Tv

Eha Tv

Next Story