టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్ర‌బాబు సోమవారం మధ్యాహ్నాం సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఢిల్లీ చేరుకున్నారు.

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ఢిల్లీ(Delhi)కి చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్ర‌బాబు సోమవారం మధ్యాహ్నాం సతీమణి నారా భువనేశ్వరి(Bhuvaneshwari)తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు దంపతులకు విమానాశ్ర‌యంలో ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్(Kanakamedala Ravindrakumar), కేశినేని నాని(Kesineni Nani), రఘురామ కృష్ణంరాజు(Raghuramakrishna Raju), రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu)లు ఘన స్వాగతం పలికారు.

ఇదిలావుంటే.. చంద్రబాబు రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది. చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా(Sidharth Luthra) తనయుడు వివాహ రిసెప్షన్ ఈ సాయంత్రం జరగనుంది. ఈ రిసెప్షన్‌కు చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. అనంతరం రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది.

Updated On 27 Nov 2023 7:44 AM GMT
Yagnik

Yagnik

Next Story