ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar) కుటుంబ సభ్యులను టీడీపీ(TDP) అధినేత‌ చంద్రబాబు(Chandrababu) పరామర్శించారు. గద్దర్ కుటుంబ సభ్యులను కలిసిన‌ చంద్రబాబు.. ఆయ‌న‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు రాకతో గద్దర్ నివాస పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. గద్దర్ కుటుంబ సభ్యులకు టీడీపీ అన్నివేళలా అండగా ఉంటుందని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar) కుటుంబ సభ్యులను టీడీపీ(TDP) అధినేత‌ చంద్రబాబు(Chandrababu) పరామర్శించారు. గద్దర్ కుటుంబ సభ్యులను కలిసిన‌ చంద్రబాబు.. ఆయ‌న‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు రాకతో గద్దర్ నివాస పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. గద్దర్ కుటుంబ సభ్యులకు టీడీపీ అన్నివేళలా అండగా ఉంటుందని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గద్దర్ చనిపోవడం బాధాకరమ‌న్నారు. గ‌ద్ద‌ర్ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అని అన్నారు. ఆయన పాట, ఆయన కృషి ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. పేదల హక్కుల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి గ‌ద్ద‌ర్ అని కొనియాడారు. గద్దర్ ప్రజలు, పేదల హక్కుల పరిరక్షణ కోసం ఒక పందా ఎన్నుకొని కృషి చేసి.. పోరాటాలకు నాంది పలికారని అన్నారు. తెలంగాణ పోరాటం లో ఎంతో కృషి చేసారని అన్నారు. ఆయనను చూస్తేనే ప్రజా యుద్ధ నౌక గుర్తు వస్తుందన్నారు. దేనికి భయపడని వ్యక్తి.. పొరాటాలే ప్రాణంగా బతికారన్నారు. ఆయన స్పూర్తి శాశ్వతంగా ఉంటుందన్నారు. గద్దర్ ది పెద్ద వయసు కాదని.. తెలుగు జాతి మంచి ఉద్యమ కారుడిని కోల్పోయిందన్నారు. గ‌ద్ద‌ర్ ఆత్మకు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నానని.. కుటుంబ సభ్యులు ఆయన ఆశయాలు కొనసాగించాలన్నారు.

Updated On 15 Aug 2023 3:02 AM GMT
Ehatv

Ehatv

Next Story