టీడీపీ అధినేత చంద్రబాబుకు తృటి లో ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో పాల్గొన్న చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)కు తృటి లో ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి(Eastgodavari) జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఏర్పాటు చేసిన రా కదలిరా(Ra Kadali Ra) సభలో పాల్గొన్న చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. చంద్ర‌బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు టీడీపీ నేతలు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేశారు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబును టీడీపీ నేతలు తోసేశారు. దీంతో చంద్రబాబు తుళ్లి పడబోయారు. వెంటనే అలర్ట్‌ అయిన ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయనను పట్టుకుని నిల్చోబెట్టారు. అనంత‌రం సెక్యూరిటీ సిబ్బంది టీడీపీ నేతలందరినీ స్టేజీ కిందకి దించేశారు.

Updated On 29 Jan 2024 10:23 AM GMT
Yagnik

Yagnik

Next Story