బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే మొదటి పేరు చంద్రబాబుదని

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా అని ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదని.. ప్రతి ఐదేళ్లకొకసారి బీసీలను మోసగించడం చాలా సులభం అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. టీడీపీ ఆశయాలు లక్ష్యాలు ఎన్టీ రామారావుతోనే కనుమరుగైపోయాయని.. ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కి ఓట్ల కోసం ఆయన పేరు మాత్రం చంద్రబాబు నాయుడు జపం చేస్తాడన్నారు. బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీ.. రాజ్యాంగ విలువలను ఏమాత్రం కాపాడని పార్టీ టీడీపీ అని అన్నారు.

బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే మొదటి పేరు చంద్రబాబుదని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. చంద్రబాబు నైజం 2009లో చూశామని.. బీసీల కోసం 142 హామీలు అప్పట్లో ఇచ్చాడు.. అందులో ఎన్ని హామీలను అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీసీలకు విద్యను అందకుండా చేసిన బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడన్నారు. బీసీలు అంటే చంద్రబాబు దృష్టిలో బానిసలు.. సీఎం జగన్ హయాంలో బీసీలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారన్నారు.

Updated On 6 March 2024 12:13 AM GMT
Yagnik

Yagnik

Next Story