చంద్రబాబు పల్నాడు బహిరంగ సభలో మాట్లాడిన తీరు కరెక్ట్ కాదని మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు

చంద్రబాబు పల్నాడు బహిరంగ సభలో మాట్లాడిన తీరు కరెక్ట్ కాదని మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. కల్లబొల్లి ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేశారన్నారు. తన 14 ఏళ్లు పరిపాలనలో పల్నాడుకు ఏం చేశాడో చెప్పే ప్రయత్నం మాత్రం ఆయన చేయలేదన్నారు. చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420 అని ధ్వజమెత్తారు అంబటి. ​కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబు.. కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించారన్నారు. చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డారని.. కోడెల చనిపోయినా ఆ కుటుంబంపై చంద్రబాబుకు కక్ష పోలేదని విమర్శించారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మారీచుడు అని.. మార్చమని చంద్రబాబు నాయుడు అంటున్నారని.. మార్చేది లేదు..నీకు దమ్ముంటే పిన్నెల్లిని ఓడించని సవాల్ విసిరారు అంబటి. అతన్ని చూస్తేనే భయపడుతున్నావని అన్నారు. కాసు మహేష్‌ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదని.. వారి కుటుంబం ఈ రాష్ట్రంలో అనేకమైన పదవులు నిర్వహించారన్నారు. మీ పరిపాలనలో ఈ 7 నియోజకవర్గాల్లో ఓడిపోయిన మీ వాళ్ల గురించి చెప్పడం లేదెందుకని ఎదురు ప్రశ్నించారు అంబటి. చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారో గుర్తు చేసుకోండి. అందుకే ఆ 7 నియోజకవర్గాల్లో మీ టీడీపీ అభ్యర్థులను ప్రజలు ఓడించి చరిత్ర సృష్టించారన్నారు అంబటి.

Updated On 3 March 2024 10:53 PM GMT
Yagnik

Yagnik

Next Story