ఈ ఎన్నికల్లో కూటమి ఓడిపోబోతోందని మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు

ఈ ఎన్నికల్లో కూటమి ఓడిపోబోతోందని మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతామని తెలిసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింస వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని.. ఆయనను ఎదుర్కోలేకనే మూడు పార్టీలు కలిసి వచ్చాయని మంత్రి జోగి రమేశ్ అన్నారు.

ఏపీలోని పల్నాడులో జరిగిన అల్లర్ల వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. హింసాత్మక ఘటనలపై విచారణ జరుపుతున్న సిట్‌ బృందాన్ని కలిసి పలు అంశాలను వివరించామన్నారు. పోలింగ్‌ రోజున పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసే చంద్రబాబు హింసను ప్రోత్సహించారని.. దాడుల వెనుక చంద్రబాబు, పవన్‌, పురందేశ్వరి కుట్రలు చేశారనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. సత్తెనపల్లి నుంచి మూడుసార్లు పోటీ చేశానని, ఇలాంటి హింసాత్మక ఘటనలు ఏనాడు జరగలేదన్నారు.

Updated On 24 May 2024 2:29 AM GMT
Yagnik

Yagnik

Next Story