టీడీపీ(TDP) అధినేత‌ చంద్రబాబుకు(Chandrababu) ఇచ్చే లీగల్ ములాఖత్(Mulakhath) లను కుదించడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలోనే.. లీగల్ ములాఖత్ ల విషయంలో ఆంక్షలు తొలగించి.. రోజుకు రెండు సార్లు ములాఖత్ కు అవకాశం ఇవ్వాలని కోరుతూ.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు, ఇంచార్జ్ లు మంగళవారం జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్(DIG Ravi Kiran) ను కలిసి వినతి పత్రం అంద‌జేశారు.

టీడీపీ(TDP) అధినేత‌ చంద్రబాబుకు(Chandrababu) ఇచ్చే లీగల్ ములాఖత్(Mulakhath) లను కుదించడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలోనే.. లీగల్ ములాఖత్ ల విషయంలో ఆంక్షలు తొలగించి.. రోజుకు రెండు సార్లు ములాఖత్ కు అవకాశం ఇవ్వాలని కోరుతూ.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు, ఇంచార్జ్ లు మంగళవారం జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్(DIG Ravi Kiran) ను కలిసి వినతి పత్రం అంద‌జేశారు.

చంద్రబాబు తన కేసుల్లో సరైన విధంగా న్యాయ పోరాటం చేయకుండా చూడడం కోసమే ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి లీగల్ ములాఖత్ ల‌పై ఆంక్షలు పెట్టిందని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. 39 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబును రోజూ రెండు సార్లు తన అడ్వకేట్లు కలుస్తున్నారు. అయితే నిన్నటి నుంచి రోజుకు ఒక్క సారి మాత్రమే ములాఖత్ ఉంటుందని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతున్నారని.. వీటిపై పోరాటం కోసం ఆయన నిత్యం న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని నేతలు అంటున్నారు.

ప్రభుత్వం లీగల్ ములాఖత్ లను తగ్గించడం ద్వారా.. న్యాయం కోసం చంద్రబాబు ముందుకు వెళ్లకుండా చూడాలన్న కుట్ర చేసిందని నేతలు ఆరోపిస్తున్నారు. లీగల్ ములాఖత్ ల విషయంలో ఆంక్షలు తొలగించి.. రోజుకు రెండు సార్లు ములాఖత్ కు అవకాశం ఇవ్వాలని డీఐజీని కోరారు. చంద్రబాబు భద్రత, కుటుంబ సభ్యులకు కూడా మెడికల్ నివేదిక ఇవ్వకపోవడం వంటి అంశాలపై తగు చర్యలు తీసుకోవాలని డీఐజీకి విన్న‌వించారు.

డీఐజీ క‌లిసిన వారిలో పార్టీ నేతలు నిమ్మకాలయ చినరాజప్ప, జవహర్, బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బూరుగుపల్లి శేషారావు, ఎస్విఎస్ఎన్ వర్మ, బొడ్డు వెంకట రమణ చౌదరి, మద్దిపాటి వెంకట రాజు తదితరులు ఉన్నారు. "Written By : Journalist M.Phani Kumar"

Updated On 17 Oct 2023 6:26 AM GMT
Ehatv

Ehatv

Next Story