శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఓ ప్ర‌క‌ట‌న‌లో కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియ‌జేశారు

శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఓ ప్ర‌క‌ట‌న‌లో కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమే. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘశ్యాముని కృపా, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story