యువగళంతో లోకేశ్(Nara Lokesh) ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడన్న అక్కసుతోనే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలనే ఆలోచనలో సైకో జగన్ ఉన్నాడని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న(Buddha Venkanna) వ్యాఖ్యానించారు. సాక్షి మీడియాకు ప్రకటనలరూపంలో ప్రజలసొమ్ము దోచిపెట్టడానికి ఉత్సాహం చూపే జగన్(Jagan).. విద్యాదీవెన, అమ్మఒడి చెల్లింపులు ఒకేసారి చేయడానికి నిధులు లేవంటాడని ఆరోపించారు.

యువగళంతో లోకేశ్(Nara Lokesh) ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడన్న అక్కసుతోనే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలనే ఆలోచనలో సైకో జగన్ ఉన్నాడని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న(Buddha Venkanna) వ్యాఖ్యానించారు. సాక్షి మీడియాకు ప్రకటనలరూపంలో ప్రజలసొమ్ము దోచిపెట్టడానికి ఉత్సాహం చూపే జగన్(Jagan).. విద్యాదీవెన, అమ్మఒడి చెల్లింపులు ఒకేసారి చేయడానికి నిధులు లేవంటాడని ఆరోపించారు. అంగన్ వాడీ, ఆశావర్కర్లకు జీతాలు పెంచడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవుగానీ.. సాక్షి మీడియాకు వందలకోట్లు కట్టబెట్టడానికి మాత్రం నిధుల‌కు కొర‌త లేద‌న్నారు.

ఇతర దినపత్రికలు.. న్యూస్ ఛానెళ్లను తప్పుపట్టే ముందు సాక్షి మీడియా(Sakshi Media) పుట్టుక.. దాని పనితీరు ఏమిటో జగన్ చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లలో సాక్షి మీడియాకు ఎంత సొమ్ము దోచిపెట్టాడో తెలియచేస్తూ శ్వేతపత్రం(White Paper) విడుదల చేసే దమ్ము, ధైర్యం జగన్ కు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. 57 నెలల్లో జగన్ రెడ్డి 10 జన్మలకు సరిపడా పాపాలు చేసి, పది తరాలకు సరిపడేంత దోచేశాడని ఆరోపించారు. ఆయన చేసిన తప్పులకు ఒక్కసారి జైలుకు (Jail)వెళ్లాడంటే ఇక బయటకు రాలేడని అన్నారు. వైసీపీ(YSRCP) గెలవదని తెలిసే రోజా లాంటి వారు కూడా తాము త్యాగాలకు సిద్ధమంటూ పోటీనుంచి తప్పుకుంటున్నారని అన్నారు.

Updated On 22 Dec 2023 8:43 AM GMT
Ehatv

Ehatv

Next Story