టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

టీడీపీ(TDP)లో గెలిచి వైసీపీ(YCP)లో చేరిన వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) అన్నారు. విజయవాడలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి వరకు కొడాలి నాని(Kodali Nani) మొరిగేవాడు.. ఇప్పుడు కేశినేని నాని కుక్కలా మొరుగుతున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు(Chandrababu) టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని వాగుతున్నాడు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandrareddy) దోపిడీ దారుల్లో ముందు వరుస‌లో ఉంటాడని ఆరోపించారు. కేశినేని నాని(Kesineni Nani) సత్యహరిశ్చంద్రుడిలా పెద్ది రెడ్డి మాట్లాడుతున్నాడు.. ఇలాంటి నీచ, నికృష్ట సీఎం ను నా జీవితంలో చూడలేదని కేశినేని నాని అన్నాడు.. పెద్ది రెడ్డి అన్నట్లు చంద్రబాబు గురించి నాని చెప్పింది నిజమైతే.. జగన్(Jagan) గురించి అదే నాని మాట్లాడింది కూడా నిజమని అంగీకరిస్తారా అని ప్ర‌శ్నించారు.

కేశినేని నాని పరమ వెధవ.. ఒక్కటి కూడా నిజం చెప్పడని అన్నారు. వసంత కృష్ణప్రసాద్ కు రాజకీయ చరిత్ర ఉంది.. ఆయన తండ్రి హోంమంత్రిగా చేశారు. కేశినేని నాని వంటి అబద్దాల కోరు రాకతో.. వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) బయటకు వచ్చారు. వసంత గతంలోనే చంద్రబాబును విమర్శించను అని బహిరంగంగా చెప్పాడు. కేశినేని నాని తో తిరిగితే.. తనకు ఓటమి తప్పదనే వసంత వైసీపీని వీడాడని అన్నారు.

దున్నపోతులా బలిసి, లావు చూసి బలం అనుకుంటున్నాడు.. కేశినేని నాని అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నీ వెనుక పట్టుమని పది మంది వెళ్లేలదు.. చంద్రబాబును విమర్శిస్తావా అని మండిప‌డ్డారు. విజయవాడ పశ్చిమ విషయంలో రాజీనామా చేస్తానని చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేశాడు. నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న సమయంలో నాని ఒక్క సమావేశం కూడా పెట్టలేదు. కేశినేని నాని, వెల్లంపల్లి(Vellampalli Srinivas) లు మధ్య లోపాయికారి ఒప్పందాలు గతంలోనే ఉన్నాయని.. అందుకే టీడీపీలో ఉంటూ నాని కోవర్టు రాజకీయాలు చేశాడని ఆరోపించారు.

ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇప్పిస్తామని చెప్పి.. ఇద్దరి దగ్గర కేశినేని నాని డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. కేశినేని నానీని రోడ్డు మీదకు వదలాలంటే.. ముందు అతని అప్పులు తీర్చాలి. జగన్మోహన్ రెడ్డికి కూడా చెబుతున్నాం.. ముందు నాని అప్పులు తీర్చి.. అప్పుడు సీటు ఇవ్వాలని అన్నారు. చంద్రబాబు సీట్లు అమ్ముకున్నారని నాని చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమ‌న్నారు. అత‌డి నోటి వెంట ఒక్క మాట కూడా నిజం రాదు.. క్యారెక్టర్ లెస్ ఫెలో కేశినేని నాని అంటూ విమ‌ర్శించారు.

2019 లో నాని దగ్గర డబ్బులు లేకపోయినా.. పిలిచి మరీ ఎంపీ సీటు చంద్రబాబు ఇచ్చారు. ఇప్పుడు సిగ్గు లేకుండా డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని వాగుతున్నాడు. నిన్న మైలవరం ఇన్ ఛార్జిగా వచ్చిన వ్యక్తి నుంచి కూడా నాని డబ్బులు వసూలు చేస్తాడు.. జాగ్రత్తగా ఉండండని సూచించారు.

పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని నాని ఎంతమందికి సాయం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. నాని మైలవరం ఇన్ ఛార్జిగా ఇప్పుడు.. అక్కడ కూడా అందినకాడికి దోచుకోవడం ఖాయమ‌న్నారు. జగన్ కు ఉన్న మెంటాలిటీకీ.. కేశినేని నాని బలం ఎంతో అర్దమైపోయి ఉంటుందన్నారు. నాని పార్టీ మారాక నీ బలం ఎంతో చూపించలేకపోయావు.. అసలు లేని బలాన్ని ఎలా చూపిస్తాడని ఎద్దేవా చేశారు.

నాకు తెలిసి వైసీపీలో అతనికి రేపు టిక్కెట్ కూడా ఉండదు. కేశినేని నాని వల్ల వైసీపీ కి అదనపు బరువే తప్ప.. బలం కాదని అన్నారు. కేశినేని చిన్ని టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటే.. నాని ఓర్వలేకపోయాడన్నారు. చివరకు సోదరుడు, అతని కుటుంబంపై స్టిక్కర్ కేసు పెట్టిన మూర్కుడు కేశినేని నాని అని ధ్వ‌జ‌మెత్తారు. కేశినేని నాని వెనుక అతని తల్లి, చెల్లి కూడా లేరని అన్నారు.

గద్దె రామ్మోహన్(Gadde Rammohan) రెండు సార్లు నా వల్లే గెలిచాడని నాని చెప్పుకుంటున్నాడు. గద్దె రామ్మోహన్ ఇండిపెండెంట్ గా, టీడీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనది. విజయవాడ నగర అద్యక్షుడిగా గద్దె రామ్మెహన్ ఆరేళ్లు వరుసగా పని చేసిన చరిత్ర అతనిది. గద్దె నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు 17వేలు మెజారిటీ వస్తే, కేశినేని నానికి 12వేలు మెజారిటీ వచ్చింది. కేశినేని నానికి ముని శాపం ఉంది.. వాడు మాట్లాడే ప్రతి మాట అబద్దమేన‌ని.. ఆ అబద్దాలను నమ్మి ప్రచారం చేయవద్దని మీడియాను కూడా కోరుతున్నామ‌న్నారు.

కేశినేని నాని నిందలు వేస్తే.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన పెద్దిరెడ్డి సమర్ధించడం వింతగా ఉందన్నారు. గనుల వ్యాపారం చేసే పెద్దిరెడ్డికి అదే శాఖ ఇచ్చి దోచుకోమని జగన్ అనుమతి ఇచ్చాడని ఆరోపించారు. ఇలాంటోళ్లంతా కలిసి నాని వంటి కుక్కతో మొరిగిస్తున్నారు. చంద్రబాబు నాతో ఎందుకు మాట్లాడిస్తారు.. నేను ఆయనకు వీర విధేయుడినని పేర్కొన్నారు. మా అధినేతను తిడితే.. నా లాంటోడు చూస్తూ ఊరుకుంటాడా.. తగిన బుద్ది చెబుతాం.. కేశినేని నాని ముందు నువ్వు అప్పులు తీర్చి.. అప్పుడు ప్రజల్లోకి రా అని వెంక‌న్న వ్యాఖ్యానించారు.

Updated On 3 Feb 2024 12:21 AM GMT
Yagnik

Yagnik

Next Story