నిన్న జగన్ రెడ్డి(Jagan Reddy) పిచ్చి పిచ్చిగా మాట్లాడార‌ని టీడీపీ(TDP) నేత బుద్దా వెంకన్న అన్నారు. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పెద్ద గజ దొంగ.. చార్లెస్ శోభరాజ్ లాగా జగన్ ను అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబును(Chandrababu) ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నిన్న జగన్ రెడ్డి(Jagan Reddy) పిచ్చి పిచ్చిగా మాట్లాడార‌ని టీడీపీ(TDP) నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) అన్నారు. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పెద్ద గజ దొంగ.. చార్లెస్ శోభరాజ్ లాగా జగన్ ను అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబును(Chandrababu) ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ్రిటీష్ వాళ్లు గాంధీజీని‌ పెట్టినట్లు.. జ‌గ‌న్‌ చంద్రబాబును జైల్లో పెట్టారని ప్రజలు అనుకుంటున్నారని వివ‌రించారు. చంద్రబాబును జైల్లో వేసి దొంగను చేశానని.. జగన్ సంకలు గుద్దుకుంటున్నార‌ని.. ప్రజలు ఎవరూ చంద్రబాబును దొంగలా భావించడం లేదని అన్నారు. జగన్ ను మాత్రం అవినీతి పరుడిగానే ప్రజలు గుర్తించారని వ్యాఖ్యానించారు. చార్లెస్ శోభరాజ్ లా జగన్ ను జైల్లో పెడితే.. నీ అవినీతి లో వాటాదారులే ఆయ‌న్ని కలిశారని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై జాతీయ నాయకులు కూడా స్పందించారని వెల్ల‌డించారు.

పవన్ కళ్యాణ్(Pawan kalyan) కూడా ములాఖత్ కు వెళ్లి పరామర్శించారని తెలిపారు. మిలాఖత్ అనే వైసీపీ నాయకులు కు సిగ్గు, శరం ఉందా అని ప్ర‌శ్నించారు. దేశంలోనే అతి పెద్ద అవినీతి పరుడి పార్టీలో మీరంతా ఉన్నారని మండిప‌డ్డారు. జైల్లో చంద్రబాబు కు సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నార‌ని ఆరోపించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి(Bhuvaneswari) కూడా ములాఖాత్ అవకాశం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్టును.. దగ్గర నుంచీ కెమెరా పెట్టి చూస్తూ.. జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నార‌ని అన్నారు. చంద్రబాబు అరెస్టును అందరూ అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.

జగన్ ను అరెస్టు చేస్తే.. అవినీతి పరుడు జైలుకు వెళ్లాడనే అన్నారు. రిమాండ్ రిపోర్ట్ చూసిన ఎవరైనా చంద్రబాబుపై ఆధారాలు లేవనే అర్ధమవుతుందన్నారు. జగన్ లాగా బాంబులు చుట్టిన నేపథ్యం చంద్రబాబుకు లేదన్నారు. హత్యలు, కుట్రలు, అవినీతి నేపధ్యం మొత్తం నీ కుటుంబం వైపే ఉన్నాయన్నారు. జగన్ దొంగ కాబట్టే... అందరినీ దొంగ దొంగ అని అరుస్తున్నార‌ని అన్నారు. ఎన్నికల వరకూ పని చేయించుకుని సొంత తల్లి, చెల్లినే గెంటేసిన చరిత్ర నీది అని విమ‌ర్శించారు.

కుటుంబ విలువలు తెలియని ఏకైక వ్యక్తి జగన్ అని అన్నారు. సొంత బాబాయినే హత్య చేయించి, ఆమె కుమార్తె పై నీచపు రాతలు రాయించార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగన్ కుఅధికారం, డబ్బు తప్ప‌‌.. బంధాలు అవసరం లేదన్నారు. చంద్రబాబు, ఆయ‌న‌ కుటుంబం ఒక వైట్ పేపర్.. నువ్వు ఎలాంటి నిందలు వేసినా, అవి గాలి కబుర్లు అని అన్నారు.

ఇప్పుడు లోకేష్ ను అరెస్టు చేస్తాం అంటున్నారు.. రేపు భువనేశ్వరి, బ్రాహ్మణి ని కూడా అరెస్టు చేస్తారేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తోడు అయ్యాడని జగన్ భయ పడుతున్నారని అన్నారు. 175 స్థానాల్లో వైసీపీకి అభ్యర్థులు లేరని అన్నారు. నువ్వు ఇచ్చే డబ్బులు నీ అభ్యర్థులు ఇళ్లల్లో దాచుకుంటారని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైపీసీ ఓటమి ఖాయం అన్నారు. జగన్ ఇంటికి వెళతారు.. వైసీపీని క్లోజ్ చేయడం పక్కా అని జోష్యం చెప్పారు. చంద్రబాబు మాకు సుప్రీం.. జనసేన, టీడీపీ కలిసి పని చేస్తాయని అన్నారు.

Updated On 17 Sep 2023 2:37 AM GMT
Ehatv

Ehatv

Next Story