రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandheswari) పేర్కొన్నారు. బుధవారం జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధి కారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి అభినందనలు తెలిపారు. అందరికీ ఒక నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. పార్టీకి అంకిత భావంతో పని చేయాల్సి వుంటుంది. కొంత మందికి పదవి లేదని బాధ వుండొచ్చు. తన మూడేళ్ల పదవీ కాలం లో కార్యకర్తలు సంతృప్తి పడేలా పనితీరు వుంటుందన్నారు. జాతీయ పార్టీ ఇస్తున్న కార్యక్రమాలు విజయ వంతం చేయడానికి సంసిద్దులు కావాలని పిలుపునిచ్చారు. పధాధి కారులు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు.

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్
టీటీడీలో మత మార్పిడి జరుగుతోంది
రాష్ట్రం అంధకార ఆంధ్రప్రదేశ్ గా మారుతోంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandheswari) పేర్కొన్నారు. బుధవారం జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధి కారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి అభినందనలు తెలిపారు. అందరికీ ఒక నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. పార్టీకి అంకిత భావంతో పని చేయాల్సి వుంటుంది. కొంత మందికి పదవి లేదని బాధ వుండొచ్చు. తన మూడేళ్ల పదవీ కాలం లో కార్యకర్తలు సంతృప్తి పడేలా పనితీరు వుంటుందన్నారు. జాతీయ పార్టీ ఇస్తున్న కార్యక్రమాలు విజయ వంతం చేయడానికి సంసిద్దులు కావాలని పిలుపునిచ్చారు. పధాధి కారులు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు.

రాష్ట్రం అప్పుల(debt) భారం తో కుంగి పోతుంది. వైసిపి(YCP) ప్రభుత్వం వచ్చాక 7.44 లక్షల కోట్ల రుణాలు వుండగా టీడీపీ(TDP) హయాంలో 3.74 లక్షల కోట్ల అప్పులు మాత్రమే వుండేవన్నారు. దీనిపై వివరణ ఇవ్వడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ మీడియా ముందుకు వచ్చారు. కానీ మంత్రి ప్రభుత్వ ఆస్తుల తనఖా పై అప్పుల విషయం, నిధుల మళ్లింపు చెప్ప లేదు. కాంట్రాక్టర్ లకు బిల్లుల పెండింగ్ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం బెవరేజేస్ బాండ్లు కొనుగొలుకి ఎవరూ రాక పోవడం బీజేపీ విజయం అని అభివర్ణించారు. పంచాయతీ లకు నిధులు విడుదల చేయడం లేదు, బీజేపీ ఆందోళన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం రూ.980 కోట్ల నిధులు ఇచ్చారు. గ్రామ సభ ఆమోదం లేకుండా 70 శాతం విద్యుత్ బిల్లుల కింద ప్రభుత్వం మినహాయింపు అన్యాయం అన్నారు. నిధుల మళ్లింపు పై ఆందోళన నిర్వహించాలి అని పిలుపునిచ్చారు. మిత్ర పక్షం జన సేనతో కలిసి పని చేయాలన్నారు. నిధులు లేక వైసీపీ సర్పంచులు కూడా బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు వినతి పత్రం అందజేస్తామన్నారు. డిస్టలరీస్ అధికార పార్టీ నేతల చేతుల్లో ఉన్నాయని ఆమె ఆరోపించారు.

రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారు. తద్వారా ఎంతోమంది చనిపోతున్నారు అని ఆవేదన వ్యక్తంచేశారు. ఐ ఎం ఎఫ్ ఎల్ చ - 1993 సవరించి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. టీటీడీ చైర్మన్ గా క్రైస్తవుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన చరిత్ర వుందని పేర్కొన్నారు. రాజకీయ పునరావాసం మాదిరిగా టీటీడీ పోస్టింగ్ లు వుంటున్నాయి అని ఎద్దేవా చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో ఆరేళ్ల చిన్నారి మృతి దురదృష్ట కరం అని, భక్తులు చేతి కర్రలతో మృగాలతో పోరాటం చెయ్యాలనడం హాస్యాస్పదం అన్నారు. ఎర్ర చందనం కోసం అడవుల నరికివేత యదేచ్ఛగా జరుగుతోంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వాపోయారు. సీఎం నివాసం దగ్గర లోనే అత్యాచార ఘటన మాయని మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. బీసీ మహిళ సజీవ దహనం అయినా న్యాయం చేసే దిక్కు లేదు, వైసీపీ సర్కార్ బీసీ లను ఉద్దరిస్తున్నట్టు ప్రకటనలు గుప్పిస్తున్నారని మండి పడ్డారు.

సంస్థాగతగా పార్టీ బలోపేతం చేసుకోవాలి, కమిటీలు పటిష్టంగా వుండేలా చూసుకోవాలన్నారు. బీజేపీ అనుబంధ మోర్చాలు మరింత పటిష్టం చేయాలని చెప్పారు. విశ్వ కర్మ పథకం 17 న ప్రధాని ప్రారంభిస్తారు, తద్వారా 17 రకాల చేతి వృత్తిదారులకు ఉపయోగ పడుతుంది అన్నారు. దేశంలో 700 వందన్ కేంద్రాలు ద్వారా గిట్టుబాటు ధరలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. పోల వరం కేంద్రం నిధులతో నిర్మాణం జరుగుతుందని, ఇందులో డిజైనింగ్ లోపం వైసీపీ ప్రభుత్వం బాధ్యతే అని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కి కేంద్రం అన్యాయం చేసే ఉద్దేశం లేదు అన్నారు. ప్రత్యేక హోదాకి దీటుగా ప్యాకేజీకి అప్పటి సీఎం బాబు అంగీకారం తెలిపారన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని కోరారు. విద్యుత్ చార్జీలు 9 సార్లు పెంచారని విచారం వ్యక్తం చేశారు. అంధకార ఆంధ్రప్రదేశ్ గా మారుతోందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహా ఇంఛార్జి సునీల్ దేవదర్ జీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులుసోము వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విష్ణు కుమార్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్, సెయిల్ డైరెక్టర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బిట్రశివన్నారాయణ, గారపాటి సీతారామాంజనేయ చౌదరి, దయాకర్ రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, తదితరులతో పాటు నూతన కమిటీ పాల్గొన్నారు.

టీటీడీలో మత మార్పిడి జరుగుతోంది : బీజేపీ(BJP) రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandheswari) మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో మత మార్పిడి జరుగుతోందని, అక్కడ అడవులు నాశనం అవుతుంటే టీటీడీ పట్టించుకోవడం లేదన్నారు. ఎర్రచందనం దారి మళ్ళిస్తున్నారని, అడవులను నాశనం చేయడం వల్లనే అక్కడున్న జంతువులు జనావాసాలకు వస్తున్నాయని, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆందోళన కరంగా ప్రభుత్వం పనితీరుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలలో ఏడు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు. అప్పుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం కృంగిపోతుందని, ప్రభుత్వ ఆస్తులను సైతం తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.

Updated On 23 Aug 2023 6:13 AM GMT
Ehatv

Ehatv

Next Story