మనలో చాలా మంది అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకం.

మనలో చాలా మంది అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకం. అసలు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడనే వాడలేదని టీటీడీ ఈవో శ్యామలరావు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కొందరు పని గట్టుకుని ట్వీట్లు చేస్తూ భక్తుల భావోద్వేగాలతో ఆటలాడుకుంటున్నారు. ఇప్పుడు నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ కూడా ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు. బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు. ఆమె ఏమని ట్వీట్ చేశారంటే ‘తిరుమల లడ్డూ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనల్ని సైలెంట్‌గా ఉండమంటే ఎలా? ఇతర మతాల విషయంలోనూ ఇలానే వ్యవహరిస్తారా? అలాంటి ఆలోచన చేయాలంటేనే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. లౌకికవాదం అంటే ప్రతీ మతాన్ని గౌరవించడం. అంతేగానీ పక్షపాతంతో వ్యవహరించొద్దు. నేను హిందూ మతంలో పుట్టకపోయినా.. ఈ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నాకు అన్ని మతాలు సమానమే. హిందూ మతాన్ని అవమానించొద్దు.. చులకనగా మాట్లాడొద్దు. దాన్ని అగౌరవపరిస్తే సహించొద్దు. తిరుమల లడ్డూలు కల్తీ చేయడమంటే కోట్లాది మంది ప్రజల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతీయడమే. బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. వేంకటేశ్వరస్వామి చూస్తున్నాడు’ అని రాసుకొచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story