మంత్రి రోజా(Minister Roja)ను ఉద్దేశించి టీడీపీ నేత బండారు సత్యనారాయణ(Bandaru Satyanarayana) చేసిన అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై సినీ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్‌(Kushboo Sundar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మనిషిగా కూడా బండారు విఫలమయ్యారని మండిపడ్డారు కుష్బూ.

మంత్రి రోజా(Minister Roja)ను ఉద్దేశించి టీడీపీ నేత బండారు సత్యనారాయణ(Bandaru Satyanarayana) చేసిన అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై సినీ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్‌(Kushboo Sundar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మనిషిగా కూడా బండారు విఫలమయ్యారని మండిపడ్డారు కుష్బూ. మహిళలను దూషించడం బండారు తన జన్మహక్కు అని అనుకుంటున్నారా అని నిలదీశారు. ఓ మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు భద్రతకు, దిగజారుడు తనానికి నిదర్శనమని చెప్పారు. మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడరని, బండారు ఒక సగటు మనిషిగా కూడా విఫలమయ్యారు అని కుష్బూ సుందర్‌ అన్నారు. రోజాకు మద్దతు పలుకుతూ బండారు తక్షణమే రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated On 6 Oct 2023 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story