అమరావతి: ఏపీ రాజకీయాల్లోకి(AP Politics) బండి సంజయ్(Bandi Sanjay) ఎంట్రీ ఇవ్వనున్నారు. జగన్ ప్రభుత్వం(Jagan Govt)పై అమీతుమీకి బీజేపీ(BJP) సిద్ధమైంది. ఈ నెల 21న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ అమరావతి(Amaravathi)కి రానున్నారు. ఆయన సేవలను ఏపీలో మరింత వాడుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.

అమరావతి: ఏపీ రాజకీయాల్లోకి(AP Politics) బండి సంజయ్(Bandi Sanjay) ఎంట్రీ ఇవ్వనున్నారు. జగన్ ప్రభుత్వం(Jagan Govt)పై అమీతుమీకి బీజేపీ(BJP) సిద్ధమైంది. ఈ నెల 21న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ అమరావతి(Amaravathi)కి రానున్నారు. ఆయన సేవలను ఏపీలో మరింత వాడుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఏపీలో ఓటరు నమోదు ప్రక్రియను బండి సంజయ్ సమీక్షించనున్నారు. అలాగే తెలంగాణ తోపాటు ఏపీ , మహారాష్ట్ర, గోవా, ఒడిషా ఐదు రాష్ట్రాల బాధ్యతలు ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత మొదటిసారి బండి సంజయ్ ఈ నెల 21న విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు హీటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్షుడిగా మార్చిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. ఈ నేపథ్యంలో బండి సేవలను తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఉపయోగించుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. మొదటిసారిగా బండి సంజయ్ ఏపీకి వెళుతున్న నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

Updated On 18 Aug 2023 5:18 AM GMT
Ehatv

Ehatv

Next Story