తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి(Bhumana Karunakar Reddy)ప్రమాణం చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి(Bhumana Karunakar Reddy)ప్రమాణం చేశారు. పుష్కరిణిలో స్నానం ఆచరించి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. అనంతరం స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు. ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి, శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని, అఖిలాండం కర్పూర హారతి వెలిగించి భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలో భూమన వెంట ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి(Abhinay Reddy) ఉన్నారు. తాను టీటీడీ చైర్మన్‌(TTD Chairman)గా ఉన్నప్పుడు ఎలాంటి అపచారం జరగలేదని చెప్పారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతుకొవ్వు కలిపారన్న వ్యాఖ్యలను కరుణాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే సీబీఐ విచారణ చేయాలని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ehatv

ehatv

Next Story