ఆంధ్రప్రదేశ్‌ మంత్రి రోజాపై(Minister Roja) సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేశ్(Bandla Ganesh) మరోసారి మండిపడ్డారు. రోజా ఒక ఐటెమ్ రాణి అని కామెంట్‌ చేశారు. రేవంత్(Revanth) ఒక జాక్ పాట్ సీఎం అంటూ రోజా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమెకు బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక డైమండ్ రాణి అని, ఆమె పని చేస్తున్న పార్టీ నాయకుడు ఒక యాక్సిడెంటల్ సీఎం అని బండ్ల గణేశ్‌ అన్నారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని చెబుతూ రోజా మాదిరి చేపల పులుసు వండి పెడితే ఇక్కడ పదవులు రావని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి రోజాపై(Minister Roja) సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేశ్(Bandla Ganesh) మరోసారి మండిపడ్డారు. రోజా ఒక ఐటెమ్ రాణి అని కామెంట్‌ చేశారు. రేవంత్(Revanth) ఒక జాక్ పాట్ సీఎం అంటూ రోజా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమెకు బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక డైమండ్ రాణి అని, ఆమె పని చేస్తున్న పార్టీ నాయకుడు ఒక యాక్సిడెంటల్ సీఎం అని బండ్ల గణేశ్‌ అన్నారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని చెబుతూ రోజా మాదిరి చేపల పులుసు వండి పెడితే ఇక్కడ పదవులు రావని అన్నారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింట్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(KTR) పై కూడా బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు. కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారని, పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై మాదిరి ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ఏదో సాధిస్తామనే భ్రమల్లో ఉన్నారని బండ్ల గణేశ్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ కు మరిన్ని కష్టాలు తప్పవని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 17 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరో కేటీఆర్ చెప్పాలని అన్నారు. ఫోన్ రింగ్ అయినా కేటీఆర్ భయపడిపోతున్నారని చెప్పారు. కేసీఆర్ కొడుకుగానే తప్ప కేటీఆర్ కు మరే గుర్తింపు లేదని అన్నారు.

Updated On 27 Feb 2024 2:37 AM GMT
Ehatv

Ehatv

Next Story