లుగుదేశం పార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు(Chandrababu) అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna). ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు(Chandrababu) అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna). ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని చెప్పారు. ప్రజల్లో తెలుగుదేశానికి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారని బాలయ్య ఆరోపించారు. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల(Assembly Meetings) ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం నివాళులర్పించింది. చంద్రబాబు అరెస్టు అక్రమమని గళమెత్తటమే ప్రధాన ఎజెండాగా చట్టసభలకు వెళుతున్నామని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలిపారు. చేసిన తప్పునకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated On 21 Sep 2023 12:09 AM GMT
Ehatv

Ehatv

Next Story