లోకేష్ పాదయాత్ర అన్ని వర్గాల ప్రజల మధ్య విజయవంతంగా కొనసాగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

లోకేష్(Lokesh) పాదయాత్ర అన్ని వర్గాల ప్రజల మధ్య విజయవంతంగా కొనసాగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) పేర్కొన్నారు. నవశకం బహిరంగసభలో ఆయ‌న మాట్లాడుతూ.. ఇది యువగళం(Yuvagalam) పాదయాత్ర ముగింపు సభ కాదు.. వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అని పేర్కొన్నారు. రాష్ట్ర యువత వైసీపీ(YSRCP) ప్ర‌భుత్వంలో తమకు జరిగిన అన్యాయం, ఇబ్బందులను గుర్తుపెట్టుకోవాలన్నారు. 1982లో ఎన్టీఆర్(NTR) ఇచ్చిన పిలుపునకు కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా విశేష స్పందన వచ్చిందని.. అదే విధంగా నేడు యువగళం పాదయాత్రకు అంతటి విశేష స్పందన వచ్చిందన్నారు. యువనేతపై ఈగ వాలకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కాపాడుకుంటూ వచ్చారని. యువనేతకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అన పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన జీవితాన్ని సినిమాకే కాకుండా.. ప్రజాసమస్యలపై పోరాటానికి అధికంగా కేటాయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై పవన్ తిరుగులేని పోరాటం చేశారని కొనియాడారు. చంద్రబాబు(Chandrababu) తన విజన్ తో ఐటీ, డ్వాక్రాను తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు కొనసాగించి పేదలకు అండగా నిలిచారన్నారు. ప్రపంచదేశాలకు చంద్రబాబు తన విజన్ ను పరిచయం చేశాడని.. జగన్‌(Jagan) రాష్ట్రానికి హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, కూల్చివేతలను పరిచయం చేశాడని విమ‌ర్శించారు.

జగన్‌ రాష్ట్రాభివృద్ధిని నిర్వీర్యం చేసి రూ.10లక్షల కోట్ల అప్పు చేశాడని ఆరోపించారు. అరాచకపాలనలో ధరలు, పన్నులు, రేట్లు ఆకాశాన్నంటాయి.. సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకమైందన్నారు. జగన్ ల్యాండ్, శాండ్, మైన్ స్కాములతో దోచుకుంటున్నాడు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నాడని అన్నారు. ఏపీకి రాజధాని కోసం భూములిచ్చిన రైతులను వేధించాడు..అక్రమ కేసులతో బెదిరిస్తున్నాడని ఆరోపించారు. పోలీసులు, ఉద్యోగులు, కార్మికులను జగన్‌ వేధిస్తున్నాడు. హిందూపురంలో ప్రభుత్వాసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో పెడితే.. జగన్ నిర్లక్ష్యంతో నేడు దానిలో పందులు, కుక్కలు తిరిగేలా పాడుబెట్టాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

జగన్ పాలనలో ఒక్క గుంత పూడ్చలేదు.. ఒక్క రోడ్డు వేయలేదన్నారు. సీఎం కుర్చీలో జగన్ కనకపు సింహాసనంపై శునకం మాదిరి ప్రవర్తిస్తున్నాడపి విమ‌ర్శించారు. జగన్‌ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానంటే.. అక్కడి ప్రజలు రాష్ట్ర సరిహద్దు వద్దే అడ్డుకుంటారని అన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రపంచ పటంలో ఏపీ ఉండదు..ఇది తథ్యం అన్నారు. సమయం లేదు మిత్రమా.. వచ్చే ఎన్నికల్లో విజయమా? వీరస్వర్గమా? అనేది రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలన్నారు. సొంత సామాజికవర్గాన్ని స్థానాల నుండి మార్చకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలను మాత్రమే ఓడిపోయే స్థానాల్లోకి పంపుతున్నాడు.. ఇంక సామాజిక న్యాయం ఎక్కడ? అని ప్ర‌శ్నించారు.

జగన్‌ చూపించేది కపట ప్రేమ.. సవతి తల్లి ప్రేమ.. దయచేసి ఎవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు. కప్ప బావి మాత్రమే తన ప్రపంచం అని భావించినట్లు.. జగన్‌ తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే లోకం అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. అణిచివేతలపై ఫ్రెంచి విప్లవం వచ్చిన విధంగా రాష్ట్ర ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలన్నారు. రానున్న ఎన్నికల్లో సుపరిపాలనకు స్వాగతం పలకాలి.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు. రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రజలంతా నడుం బిగించాలన్నారు. ఎవడు అడ్డొస్తాడో మేం చూస్తాం.. మీరు ముందడుగు వేయండన్నారు.

Updated On 21 Dec 2023 12:10 AM GMT
Yagnik

Yagnik

Next Story