టీటీడీ(TTD) ఈవో ఎవి ధ‌ర్మారెడ్డి(AV Dharma Reddy) శుక్ర‌వారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో(Board ex-officio) సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత

టీటీడీ(TTD) ఈవో ఎవి ధ‌ర్మారెడ్డి(AV Dharma Reddy) శుక్ర‌వారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో(Board ex-officio) సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత జేఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి(Sadha Bhargavi) వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం జేఈవో శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు, చిత్ర‌ప‌టాన్ని అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు లోక‌నాథం, గోవింద‌రాజ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated On 1 Sep 2023 6:57 AM GMT
Ehatv

Ehatv

Next Story