ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ముగింపు దశకు చేరుకుంది. 2024 మే మాసానికి పదేళ్ల కాలపరిమితి ముగియనుంది. విభజన చట్టంలో పేర్కొని, అమలు కాని అంశాలపై దృష్టి సారిస్తున్నారు కానీ రాయలసీమ భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశం చర్చకు రావడం లేదు.. అదే ఆర్టికల్‌ 371 D(Article 371 D).

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ముగింపు దశకు చేరుకుంది. 2024 మే మాసానికి పదేళ్ల కాలపరిమితి ముగియనుంది. విభజన చట్టంలో పేర్కొని, అమలు కాని అంశాలపై దృష్టి సారిస్తున్నారు కానీ రాయలసీమ భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశం చర్చకు రావడం లేదు.. అదే ఆర్టికల్‌ 371 D(Article 371 D). 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర(Andhra) రాష్ట్రం - హైదరాబాద్‌(Hyderabad) రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రంలో కలిస్తే తాము శాశ్వతంగా నష్టపోతామన్న భయం తెలంగాణ(Telangaa) వాసులకు వుండింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉభయ ప్రాంతాలకు చెందిన పెద్ద మనుషులు ఓ ఒప్పందం చేసుకున్నారు.

అందులో విద్యా ఉపాధి అవకాశాలలో తెలంగాణకు రక్షణ ఏర్పాట్లు చేయాలనే ఒప్పందం కుదిరింది. అటుపిమ్మట జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చిన నేపథ్యంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ(Indra Gandhi) ఆంధ్రప్రదేశ్ ఐక్యతను కాపాడటం మరియు వెనుకబడిన ప్రాంత ప్రజల విద్యా ఉపాధికి రక్షణ కోసం ఆర్టికల్ 371 Dని 1973 లో 32 రాజ్యాంగ సవరణ తో విలీనం చేశారు. రాష్టప్రతి ఆమోదం తర్వాత గెజిట్ చేయడంతో అమల్లోకి వచ్చింది. తెలంగాణ కు 46 శాతం, కోస్తాంధ్ర కు 32 శాతం రాయలసీమ కు 22 శాతం అవకాశాలు వస్తాయి. అదే సమయంలో ఉన్నత, సాంకేతిక మరియు మెడికల్ విద్యలో ఉస్మానియా జోన్ గా తెలంగాణ AU జోన్ గా శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు SVU జోన్ లో రాయలసీమ నెల్లూరు జిల్లాలుగా ఏర్పాటు చేసి ఆయా జోన్ లో వారికి 85 శాతం రిజర్వేషన్ కల్పించారు.

విభజన చట్టం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఆర్టికల్ 371 డి మనుగడ కోల్పోతుంది.

ఆర్టికల్ 371 D కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం రూపొందించింది. ఆంద్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఆర్టికల్ 371డి కూడా మనుగడను కోల్పోతుంది. విభజన చట్టంలో ఈ చట్టం రెండు రాష్ట్రాలలో 10 సంవత్సరాలు పాటు యదాతదంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అంటే 24 మేకి ముగిస్తుస్తుంది. ఆ తర్వాత వెనుకబడిన ప్రాంత ప్రజల రక్షణ కోసం రూపొందించిన చట్టం అమలులో ఉండదు.

రాయలసీమకు వచ్చిన ముప్పు ఏమిటి ?
పద్మావతి మెడికల్ కళాశాల అనుభవం ఏమి చెపుతుంది?

2024 విభజన తర్వాత ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి. కోస్తాంధ్ర ప్రాంతం ప్రారంభంలోనే ఆంగ్లేయుల ఎలుబడి క్రిందకు రావడంతో విద్యా సంస్థలు రావడం, కాటన్ కారణంగా గోదావరి, కృష్ణ పై బ్యారేజీలు రావడంతో విద్యా వైద్య పరంగా అభివృద్ధి చెందినది. సహజంగా ఓపెన్ పోటీలో అవకాశాలు వారికే దక్కే అవకాశం ఉంది. ఇది అపోహ కాదు పద్మావతి మెడికల్ కళాశాల అనుభవం కూడా అదే చెపుతుంది. ఆర్టికల్ 371డి అమలు కారణంగా SV , కర్నూలు మెడికల్ కళాశాలలో 85 శాతం సీట్లు రాయలసీమ కు దక్కుతున్నాయి. పద్మావతి లో అందుకు భిన్నంగా జీఓ 120 (ఓపెన్ కేటగిరీగా )అమలు కారణంగా 2014 - 15 విద్యా సంవత్సరంలో 120 సీట్లలో 102 సీట్లు రావాల్సి వుంటుంది. అందుకు భిన్నంగా రాయలసీమ 20 లోపే వచ్చాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు కు వెళ్లి జీఓ నెంబర్ 120ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. రాయలసీమ ఉద్యమ సంస్థలు చేసిన పోరాటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఆర్టికల్ 371డి రక్షణ ఉన్నది కాబట్టి విజయం సాధించాము. చట్ట బద్ధత లేకపోతే ? ఎందుకంటే నాటి తెలుగుదేశం ప్రభుత్వం 120 అమలు కోసం సుప్రీం వరకు వెల్లింది. 371డి లేకుండా ఉంటే ఒక్క పద్మావతి మెడికల్ కళాశాలలోనే దాదాపు ప్రతి ఏటా 100 మెడికల్ సీట్లను రాయలసీమ నెల్లూరు విద్యార్థులు కోల్పోయే పరిస్థితి నేడు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల మన రాయలసీమ కు వచ్చినా అందులో ఉన్న వందలాది మెడికల్ సీట్లకు గ్యారంటీ లేదు.
విభజన చట్టం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకుబాటును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు న్యాయ నిపుణులతో చర్చించి ఆర్టికల్ 371 డి ని ఏపీలో కొనసాగించెందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. రాయలసీమ ఆలోచన పరులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విభజన చట్టం ముగిసే లోపు చట్టబద్ధ రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి.
-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం.

Updated On 1 Sep 2023 5:20 AM GMT
Ehatv

Ehatv

Next Story