బీజేపీ అభ్య‌ర్ధుల నామినేషన్ల కార్య‌క్ర‌మంలో పాల్గొనటానికి కేంద్ర మంత్రులు ఏపీకి రానున్నారు. నేడు నరసాపురం లోక్ సభ స్థానానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

బీజేపీ(BJP) అభ్య‌ర్ధుల నామినేషన్ల కార్య‌క్ర‌మంలో పాల్గొనటానికి కేంద్ర మంత్రులు ఏపీ(AP)కి రానున్నారు. నేడు నరసాపురం(Narasapuram) లోక్ సభ స్థానానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. శ్రీనివాస వర్మ నామినేషన్ కార్య‌క్ర‌మానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ ఎన్నికల ఇంఛార్జి అరుణ్ సింగ్ హాజ‌రుకానున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ యాదవ్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సత్యకుమార్ నామినేషన్ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి వీకే సింగ్ హాజరు కానున్నారు. కైకలూరు అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి కామినేని శ్రీ నివాస్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కామినేని శ్రీనివాస్ నామినేషన్ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ హాజరు కానున్నారు. విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి జాతీయ నేత‌, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు హాజ‌రుకానున్నారు.

Updated On 22 April 2024 11:51 PM GMT
Yagnik

Yagnik

Next Story