విద్యుత్‌(Current) వినియోగదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్నిఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర(AP state) డిస్కంలు తీసుకున్నాయి. వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండ ఎస్‌పీడీసీఎల్‌(SPDCL), సీపీడీసీఎల్‌(CPDCL), ఈపీడీసీఎల్‌(EPDCL) ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఆదాయం, వ్యయం సమానంగా ఉన్నందున వినియోగదారులు, పరిశ్రమలకు ఈ ఏడాది పాత చార్జీలే కొనసాగించనున్నట్టు వెల్లడించాయి. రైల్వేకు అందిస్తున్న విద్యుత్‌ ఛార్జీలను యూనిట్‌కు రూ

విద్యుత్‌(Current) వినియోగదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్నిఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర(AP state) డిస్కంలు తీసుకున్నాయి. వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండ ఎస్‌పీడీసీఎల్‌(SPDCL), సీపీడీసీఎల్‌(CPDCL), ఈపీడీసీఎల్‌(EPDCL) ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఆదాయం, వ్యయం సమానంగా ఉన్నందున వినియోగదారులు, పరిశ్రమలకు ఈ ఏడాది పాత చార్జీలే కొనసాగించనున్నట్టు వెల్లడించాయి. రైల్వేకు అందిస్తున్న విద్యుత్‌ ఛార్జీలను యూనిట్‌కు రూ.1, గ్రీన్‌ పవర్‌ కేటగిరీలో 75 పైసల నుంచి రూ.1కి పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీఈఆర్సీని కోరాయి.

ఈ ప్రతిపాదనలకు త్వరలో ఆమోదం లభించనుంది. దీంతో రూ.100 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని తెలిపాయి. 2023–24లో ఆమోదించిన టారిఫ్‌ ధరలనే వచ్చే ఏడాదీ అమలు చేయనున్నట్లు తెలిపాయి. సోమవారం నాడు వైజాగ్‌లో ఏపీ ఈపీడీసీఎల్‌ కార్యాలయంలో ఏపీఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్‌ రామ్‌ సింగ్, పీవీఆర్‌ రెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ వర్చువల్‌ విచారణ మొదలైంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధనశాఖ, ట్రాన్స్‌కో, జెన్‌కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్‌ సంస్థల ప్రతిపాదనలకు సంబంధించి తొలి రోజు 17 మంది అభిప్రాయాలు చెప్పారు.

Updated On 30 Jan 2024 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story