ఆడపిల్లల బాత్ రూముల్లో(Bathroom) హిడెన్ కెమెరాలు(Hidden Camera).. 3వందలకు పైగా వీడియోలు..

ఆడపిల్లల బాత్ రూముల్లో(Bathroom) హిడెన్ కెమెరాలు(Hidden Camera).. 3వందలకు పైగా వీడియోలు.. విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు.. ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న ఈ ఘ‌ట‌న‌పై ఏపీసీసీ ఛీప్(APCC) వైఎస్ షర్మిలా రెడ్డి(YS sharmila reddy) స్పందించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి(Gudlavalleru College) అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. చదవు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే.. వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం అన్నారు. కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘ‌ట‌న‌ సజీవ సాక్ష్యం.. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్ఫణం అని దుయ్య‌బ‌ట్టారు. కాసుల కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ అన్నారు.

ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు.. ఫాస్ట్రాక్ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తక్షణం ఉన్నతస్థాయి కమిటీ వేయాలి.. సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలన్నారు. బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలన్నారు. రాజకీయ నాయకుడి కొడుకా..కూతురా కాదు.. కెమెరాలు పెట్టింది ఎవరైనా.. ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేన‌న్నారు. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. వచ్చేవారంలోపు చర్యలు చేపట్టకపోతే.. నేను కాలేజీని సందర్శిస్తాన‌ని.. విద్యార్థినిల‌తో మాట్లాడి.. వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకూ వారి పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story