ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి కొత్త సర్వీసు రానుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి కొత్త సర్వీసు రానుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందేందుకు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డు(Senior Citizen Card)ను ఇకపై రాష్ట్రప్రభుత్వం డిజిటల్ రూపంలో ఇవ్వనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ డిజిటల్ కార్డు అందించేలా కొత్త సర్వీస్ తీసుకువస్తున్నారు. ఈ కార్డుతో ప్రభుత్వ, ప్రైవేటు సర్వీసులు పొందే అవకావం ఉంది. ఆస్పత్రుల్లో ప్రత్యేక క్యూలు, రాయితీలకు అవకాశం ఉంది. మందులు, డయాటగ్నోస్టిక్ సెంటర్లలో పరీక్షలపై రాయితీలు కల్పించే అవకాశం ఉంది. భారతీయ రైల్వే సంస్థ రైలు ప్రయా ణంలో 60 ఏళ్లు నిండిన పురుషులకు, 58 ఏళ్లు నిం డిన మహిళలకు 40 శాతం టికెట్ రాయితీ, 80 ఏళ్లు నిండిన వారికి 50శాతం రాయితీ కల్పిస్తుంది. కొన్ని ప్రైవేట్ బస్ సర్వీస్‌లు, ఎయిర్ లైన్స్ కూడా టికెట్ ధరలు తగ్గిస్తున్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ వంటి పథకాలకు అర్హత. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పెన్షన్ స్కీమ్ లకు అవకాశం ఉంది.

ehatv

ehatv

Next Story