విశాఖలో ఘనంగా ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ .. కొద్దిసేపటి క్రితమే CM జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సమ్మిట్ కు హాజరైన పారిశ్రామిక వేత్తలకు వీడియో ప్రజెంటేషన్ ద్వారా ఘనంగా స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగం . గ్లోబల్ సమ్మిట్ కు హాజరు అయినా దేశ విదేశీయ పారిశ్రామిక నేతలు . రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు వివిధ […]

విశాఖలో ఘనంగా ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ .. కొద్దిసేపటి క్రితమే CM జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సమ్మిట్ కు హాజరైన పారిశ్రామిక వేత్తలకు వీడియో ప్రజెంటేషన్ ద్వారా ఘనంగా స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగం . గ్లోబల్ సమ్మిట్ కు హాజరు అయినా దేశ విదేశీయ పారిశ్రామిక నేతలు . రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు వివిధ రంగాల వ్యాపారవేత్తలు ,కేంద్రమంత్రులు ,ఇతర దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు . ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ కి సాదర స్వాగతం పలికారు C.M జగన్.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కి వస్తున్న అతిధులకు అదిరిపోయే రేంజ్ లో ఏర్పాట్లు చేసింది AP ప్రభుత్వం . ఈ సమ్మిట్ కి వచ్చే వారికీ హెలికాప్టర్స్ ,లగ్జరీ కార్లను అందుబాటులో ఉంచారు . 1500 లకు పైగా గెస్ట్స్ కోసం ప్రముఖ హోటల్స్ లో సూట్ రూమ్స్ ని కూడా బుక్ చేయడం జరిగింది.

అంబానీ, అదానీ, మిట్టల్‌, బజాజ్‌, ఆదిత్యా బిర్లా, జిందాల్‌, జీఎంఆర్‌ లాంటి అనేకమంది పారిశ్రామిక దిగ్గజాలు 25 ప్రత్యేక విమానాల్లో ఈ సమ్మిట్‌కి ఇప్పటికే హాజరు కావటం జరిగింది . కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌రెడ్డి వంటి నేతలు కూడా సమ్మిట్ పాల్గున్నారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ఆంద్రప్రదేశ్ కు మద్దతుగా పలు దేశాలు నిలవనున్నాయి.

Updated On 3 March 2023 12:42 AM GMT
Ehatv

Ehatv

Next Story