సోషల్‌ మీడియా(social media) వేదికగా ఏపీ మాజీ సీఎం జగన్‌పై(CM Jagan) మరోసారి విమర్శలు గుప్పించారు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల(YS sharmila).

సోషల్‌ మీడియా(social media) వేదికగా ఏపీ మాజీ సీఎం జగన్‌పై(CM Jagan) మరోసారి విమర్శలు గుప్పించారు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల(YS sharmila). ఢిల్లీలో(Delhi) ధర్నాకు కాంగ్రెస్‌(Congress) ఎందుకు మద్దతివ్వలేదో ఆ పార్టీనే అడగాలని మీడియాతో అన్న జగన్‌ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే జగన్ ఢిల్లీ వెళ్లడం ఎందుకు అని గతంలో విమర్శించిన షర్మిల తాజాగా మరోసారి విమర్శలు చేశారు. ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా, వ్యక్తిగత హత్యకు రాజకీయరంగు పులమడం కరెక్టా అని సోషల్‌ మీడియా వేదిక 'ఎక్స్'లో ప్రశ్నించింది.

షర్మిల ట్వీట్‌లో 'కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు... మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి ?

పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు...ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? YSR వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా...రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్దం అన్న వాళ్లకు 11మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు?' అంటూ రాసుకొచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story