ఆంధ్రప్రదేశ్ లో 2023-24 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ. 2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. ముందుగా ఆయన పోతన, రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. వరుసగా ఐదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆయన.. కొవిడ్ సమయంలో రాత్రి ఒంటిగంట వరకు ఆర్థికశాఖ పనిచేసిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో 2023-24 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ. 2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. ముందుగా ఆయన పోతన, రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. వరుసగా ఐదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆయన.. కొవిడ్ సమయంలో రాత్రి ఒంటిగంట వరకు ఆర్థికశాఖ పనిచేసిందని తెలిపారు.

కరోనా సంక్షోభ సమయంలో ఆటుపోట్లను అధిగమించామని, ఒకేకుటుంబంలాగా ఆర్థిక శాఖ పనిచేసింది మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇక మరోవైపు సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన ఇవే ప్రభుత్వ లక్ష్యాలు అన్నారు మంత్రి. స్థూల వృద్ధిలో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉందని తెలిపారు ఆయన. రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం తమదని అసెంబ్లీలో అన్నారు.

ఏపీలో 62 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్టు మంత్రి బుగ్గన తెలిపారు. రైతు ఆదాయం పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల పనితీరును ప్రపంచం మెచ్చుకుందన్నారు. గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నామన్నారు. ఆర్బీకేల పనితీరును నీతి ఆయోగ్ ప్రశంసించింది తెలిపారు. పొలం బడి కార్యక్రమాల ద్వారా దిగుబడి పెరిగిందని ఆర్థికమంత్రి బుగ్గన చెప్పారు.

బడ్జెట్ కేటాయింపులు ఇలా..

* రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
* మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
* రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు
* ద్రవ్యలోటు రూ.54,587 కోట్లు
* జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం
* ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం: మంత్రి బుగ్గన
* వ్యవసాయ శాఖ రూ.11589.48 కోట్లు
* సెకండరీ ఎడ్యుకేషన్ రూ.29690.71 కోట్లు
* వైద్యారోగ్యశాఖ రూ. 15882.34 కోట్లు
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూ.15873.83 కోట్లు
* వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు
* వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
* జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు
* జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు
* వైఎస్ఆర్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు
* డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
* రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
* వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు
* జగనన్న చేదోడు రూ.350 కోట్లు
* వైఎస్ఆర్ వాహనమిత్ర రూ.275 కోట్లు
* వైఎస్ఆర్ నేతన్న హస్తం రూ.200కోట్లు
* వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
* మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు
* రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు
* లా నేస్తం రూ.17 కోట్లు
* జగనన్న తోడు రూ.35 కోట్లు
* ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు
* వైఎస్ఆర్ కల్యాణమస్తు రూ.200 కోట్లు
* వైఎస్ఆర్ ఆసరా రూ.6700 కోట్లు
* వైఎస్ఆర్ చేయూత రూ.5000 కోట్లు
* అమ్మ ఒడి రూ.6500 కోట్లు
* మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
* ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు
* వ్యవసాయ యాంత్రీవకరణ రూ.1,212 కోట్లు
* మనబడి నాడునేడు రూ.3,500 కోట్లు
* జగనన్న విద్యాకానుక రూ.560 కోట్లు
* పురపాలక, పట్టాణాభివృద్ధి రూ.9,381 కోట్లు
* స్కిల్ డెవలప్‏మెంట్ రూ.1,166 కోట్లు
* యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు
* షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు
* షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ. 6,929 కోట్లు
* వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు
* కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు
* మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు
* పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
* పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు
* రోడ్లు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు
* ఇరిగేషన్ శాఖకు రూ.11,908 కోట్లు
* అటవీశాఖకు రూ.685 కోట్లు
* ఎనర్జీ రూ.6,456 కోట్లు
* గ్రామ, వార్డు సచివాలయ శాఖకు రూ.3,858 కోట్లు
* గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు

Updated On 16 March 2023 4:40 AM GMT
Ehatv

Ehatv

Next Story