ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై(Chandrababu) ఆంధ్రప్రదేశ్ బీజేపీ(BJP) చీఫ్‌ పురంధేశ్వరి(Purandeshwari) ఈగ వాలనివ్వడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై(Chandrababu) ఆంధ్రప్రదేశ్ బీజేపీ(BJP) చీఫ్‌ పురంధేశ్వరి(Purandeshwari) ఈగ వాలనివ్వడం లేదు. లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మీరు ఎందుకు అలా మాట్లాడారు అని కోర్టులకు అడిగే హక్కు ఉంటుందా అని అందరూ ఆలోచన చేయాలన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ఆయన ప్రకటన చేశారన్నారు. అధికారులతో సమీక్ష చేసుకున్న తర్వాతే తిరుమల లడ్డూ విషయంపై మాట్లాడి ఉంటారని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మాట్లాడే హక్కు చంద్రబాబుకు ఉంటుందని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపైనైనా ఆయన మాట్లాడతారని, చట్ట విరుద్ధంగా మాట్లాడితే తప్పని చంద్రబాబును పురంధేశ్వరి వెనకేసుకొచ్చారు. ఎంతైనా మరిది కదా... ఆ మాత్రం అభిమానం ఉండాల్లేండి!

Eha Tv

Eha Tv

Next Story