తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన టీడీపీ నుండి వచ్చింది. విశాఖ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు సమర్థవంతంగా పనిచేశారని, ఆయన నూతన బాధ్యతలను కూడా విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటివరకు టీడీపీని నడిపించడంలో అద్భుత పనితీరును కనబర్చిన సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలియజేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

"తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారిని నియమిస్తున్నాను. విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన శ్రీ పల్లా శ్రీనివాసరావు యాదవ్ నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబరిచిన పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి అభినందనలు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు గారు ఎనలేని కృషి చేశారు" అంటూ టీడీపీ నుండి అఫీషియల్ లెటర్ విడుదలైంది.


Eha Tv

Eha Tv

Next Story