ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయ స్థా­యిలో తమ ప్రతిభను చా­టు­తూ

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయ స్థా­యిలో తమ ప్రతిభను చా­టు­తూ ఉండడం విశేషం. 2019 నుంచి 2022 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఏడు­గు­రు విద్యార్థులు తమ సైన్స్‌ ప్రతిభతో ‘జపాన్‌ సకు­రా’ పోటీలకు ఎంపిక అయ్యారు. వీరిలో ముగ్గురు జపా­న్‌లో పర్యటించి వచ్చారు. మరో నలుగురు మే నెల­లో జపాన్‌ వెళ్లనున్నారు. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదు­వుకున్న విద్యార్థుల్లో 10 మంది గ­త సెప్టెంబరులో అమెరికా, యూఎన్‌ఓలో ప్రసంగించారు. ఇప్పుడు జపాన్‌ సకురా సైన్స్‌ ఫెయిర్‌కు ఏపీ విద్యార్థులు వెళ్లారు. ‘ఇన్నోవేషన్‌ ఇన్‌ సైన్స్‌ పర్‌స్యుట్‌ ఫర్‌ ఇన్‌స్పైర్డ్‌ రీ­సె­ర్చ్‌’ (ఇన్‌స్పైర్‌) పేరుతో కేంద్ర సైన్స్‌ అండ్‌ ­టెక్నాలజీ విభాగం సైన్స్‌ పోటీలను నిర్వ­హిస్తోంది. పాఠశాల స్థాయిలోని విద్యా­ర్థులు త­మ దైనందిన జీవితంలో చూసిన సమ­స్యలకు పరి­ష్కా­రాలను చూపుతూ నమూనాలను త­యా­రు­చేయా­లి. ఇన్‌స్పైర్‌ వెబ్‌సైట్‌లో వి­వ­రా­లు నమోదు చేయాలి. గత నా­లు­గేళ్లుగా 40 వేల మందికి పైగా ప్ర­భు­త్వ పాఠశాల వి­ద్యార్థులు ప్రాజెక్టులు నమో­దు­చే­శా­రు. వీటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 400 వర­కు ఎంపి­క­వు­తుండగా, జాతీయ పోటీలకు 40 నుంచి 45 ప్రా­జె­క్టులు ఎంపికవుతున్నాయి. అలా పిల్లల్లోని టాలెంట్ బయటకు వస్తూ ఉంది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పాఠశాలల దశ-దిశ పూర్తిగా మారిపోయింది. బడ్జెట్ లో చాలా వరకూ నాడు-నేడుకు కేటాయిస్తూ ఉన్నారు. పాఠశాల విద్యార్థులు టెక్ పరంగా కూడా చాలా నేర్చుకుంటూ ఉన్నారు. పలు పోటీలలో భాగమవుతూ ఉన్నారు.

Updated On 11 Feb 2024 11:25 PM GMT
Yagnik

Yagnik

Next Story