ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి సెలవులో ఉన్నారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయ‌న‌ విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో ఈ నెల 18 నుంచి జూన్ 3 వరకూ 16 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిత సెలవులు (ఈఎల్) మంజూరు చేసింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డీజీపీ(Andhra Pradesh DGP) కేవీ రాజేంద్రనాథరెడ్డి(KV Rajendranath Reddy) సెలవులో ఉన్నారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయ‌న‌ విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో ఈ నెల 18 నుంచి జూన్ 3 వరకూ 16 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిత సెలవులు (ఈఎల్) మంజూరు చేసింది. దీంతో శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్చీ(Shankha Brata Bagchi)కి.. ఇంచార్జ్‌ డీజీపీ(Incharge DGP)గా రాష్ట్రప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. విదేశీ ప‌ర్య‌ట‌న‌ నుంచి తిరిగి వచ్చాక రాజేంద్రనాధ్ రెడ్డి యథాస్థానంలో కొనసాగుతారని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవమార్ రెడ్డి(KS Jawahar Reddy) ఉత్తర్వులిచ్చారు.

Updated On 19 May 2023 10:44 PM GMT
Yagnik

Yagnik

Next Story