ఈ నెల 16న సీఎం వైఎస్‌ జగన్ కృష్ణా జిల్లా(Krishna District) గుడివాడలో(Gudivada) పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జగన్‌ గుడివాడ మండలం మల్లాయపాలెం(Malayapalem) టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగే బహిరంగ సభలో(Public Meet) పాల్గొంటారు.

ఈ నెల 16న సీఎం వైఎస్‌ జగన్ కృష్ణా జిల్లా(Krishna District) గుడివాడలో(Gudivada) పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జగన్‌ గుడివాడ మండలం మల్లాయపాలెం(Malayapalem) టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగే బహిరంగ సభలో(Public Meet) పాల్గొంటారు. ఈ మేర‌కు సీఎంఓ అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మల్లాయపాలెం చేరుకుంటారు. అక్కడ టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం.. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Updated On 13 Jun 2023 7:43 AM GMT
Ehatv

Ehatv

Next Story