టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandra babu) ఏపీ పరువు తీస్తున్నారని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) మండిప‌డ్డారు. బుధవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు హడావుడి చేస్తున్నారని.. ఆయన బఫూన్‌కు(buffoon) ఎక్కువ, జోకర్‌కు(Joker) తక్కువ అని విమర్శించారు. పొత్తు లేకుండా ఆయన ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఎప్పుడూ చేయలేదన్నారు.

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandra babu) ఏపీ పరువు తీస్తున్నారని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) మండిప‌డ్డారు. బుధవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు హడావుడి చేస్తున్నారని.. ఆయన బఫూన్‌కు(buffoon) ఎక్కువ, జోకర్‌కు(Joker) తక్కువ అని విమర్శించారు. పొత్తు లేకుండా ఆయన ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఎప్పుడూ చేయలేదన్నారు. తిట్టిన నోటితోనే మళ్లీ బీజేపీని పొగుడుతున్నారన్నారు. ఎవరినైనా తిట్టి.. మళ్లీ గంటలో కాళ్లు పట్టుకోగలరన్నారు. ఢిల్లీలో చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో వంగి వంగి.. నంగి నంగి మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఏపీ పరువు తీస్తున్నారన్నారని ఫైర్ అయ్యారు.

పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి.. సొంతంగా పోటీ చేస్తానని చెప్పలేకపోతున్నారని.. పొత్తుల కోసం తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2024లో అధికారంలోకి వస్తే ఏదో చేస్తానని చెబుతోన్న ఆయ‌న‌.. 2019 వరకు ఏం చేశారో చెప్పాలన్నారు. తాము పవన్ కల్యాణ్‌తో లేమని.. బీజేపీతో ఉన్నామని చెబితే లోకేశ్ పాదయాత్రకు అంతమంది జనాలు వస్తారా? అని ప్ర‌శ్నించారు. లోకేశ్ పాదయాత్రకు కార్యకర్తలే రావడం లేదన్నారు.

Updated On 30 Aug 2023 8:05 AM GMT
Ehatv

Ehatv

Next Story