ఏపీలో వైసీపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది

ఏపీలో వైసీపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఆంధ్ర ప్ర‌జ‌లు పట్టం కట్టారు. ఎన్‌డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను టీడీపీ కూటమి ఏకంగా 164 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో అస‌లు ఖాతా తెరవలేక‌పోయింది. తూర్పు గోదావ‌రి, పశ్చిమ గోదావ‌రి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఒక్క చోట కూడా గెలవలేదు.

లోక్‌స‌భ‌లోని 25 స్థానాల‌కు గాను టీడీపీ కూట‌మి 21 చోట్ల విజ‌యం సాధించింది. ఇందులో టీడీపీ 16 స్థానాల్లో గెలిస్తే బీజేపీ 3 చోట్ల‌, జ‌న‌సేన 2 స్థానాల్లో విజ‌యం సాధించింది. వైసీపీ 4 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది.

Updated On 4 Jun 2024 9:02 PM GMT
Yagnik

Yagnik

Next Story