తనకు పడనివారిపై అడ్డమైన రాతలు రాసే ఓ టీడీపీ(TDP) అనుకూల మీడియా జగన్‌(Jagan) ప్రభుత్వంపై అబద్ధపు వార్త రాసుకొచ్చింది. పైగా మొదటిపేజీలో తాటికాయంత అక్షరాలతో ప్రచురించింది. తాకట్టులో సచివాలయం(Secreteriat) అంటూ ఓ అసత్యపు కథనాన్ని వండివార్చింది. 370 కోట్ల రూపాయల కోసం సచివాలయంను హెచ్‌డీఎఫ్‌సీకి(HDFC) జగన్‌ ప్రభుత్వం రాసి ఇచ్చిందని పెద్ద వార్తను ప్రచురించింది.

తనకు పడనివారిపై అడ్డమైన రాతలు రాసే ఓ టీడీపీ(TDP) అనుకూల మీడియా జగన్‌(Jagan) ప్రభుత్వంపై అబద్ధపు వార్త రాసుకొచ్చింది. పైగా మొదటిపేజీలో తాటికాయంత అక్షరాలతో ప్రచురించింది. తాకట్టులో సచివాలయం(Secreteriat) అంటూ ఓ అసత్యపు కథనాన్ని వండివార్చింది. 370 కోట్ల రూపాయల కోసం సచివాలయంను హెచ్‌డీఎఫ్‌సీకి(HDFC) జగన్‌ ప్రభుత్వం రాసి ఇచ్చిందని పెద్ద వార్తను ప్రచురించింది. తాకట్టులో సచివాలయం అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో(Andhra Jyoti) వచ్చిన కథనం పూర్తిగా అబద్ధమని ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ-APCRDA స్పష్టం చేసింది. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఇటువంటి ప్రతిపాదన ఏది తమ దగ్గరకు రాలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర సచివాలయంలోని అయిదు భవనాలు HDFCకి తాకట్టు పెట్టినట్లు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన వార్త పూర్తిగా తప్పుల తడక అని APCRDA క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు, నిరాధారమైన వార్తను ప్రచురించినందుకు ఆంధ్రజ్యోతి పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవోఎంఎస్‌ 32 ప్రకారం 2018లో కన్సార్టియం బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకులు రూ. 2060 కోట్లు మంజూరు చేశాయని.. అందులో కేవలం రూ. 1955 కోట్లు మాత్రమే సీఆర్డీఏకు రిలీజ్ చేయడం జరిగిందని ప్రకటనలో చెప్పారు. 2017 సంవత్సరంలో మౌలిక వసతుల కల్పన కోరకు హడ్కో రూ.1275 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందని..అందులో నుంచి రూ.1151 కోట్లు మాత్రమే CRDAకు రిలీజ్ అయిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ కూడా జారీ చేసిందని ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.

Updated On 4 March 2024 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story