ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్‌ షిండేతో భేటీ అయ్యారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్‌ షిండేతో భేటీ అయ్యారు. ఆదివారం ముంబైలోని షిండే నివాసంలో సమావేశమైన ఇరువురు నేత‌లు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సహా వివిధ రంగాలలో సహకారంపై చర్చించారు. X లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం.. పురోగతి కోసం తమ రాష్ట్రాల మధ్య సహకారం గురించి ముఖ్యమంత్రులు చర్చించారని చెప్పారు.

ఈ సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి దాదా భూసే, షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే హాజరయ్యారు. షిండే అధికారిక నివాసం వర్ష వద్ద ముఖ్యమంత్రులు దాదాపు అరగంట సేపు మాట్లాడినట్లు షిండే సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చలు జరిపినట్లు వారు తెలిపారు. షిండే శివ‌సేన పార్టీ టీడీపీతో పాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూట‌మిలో భాగ‌స్వామ్య పార్టీ.

Eha Tv

Eha Tv

Next Story