సీఎం జగన్ బస్సులో వైద్యం చేయించుకున్న తర్వాత 'మేమంత సిద్దం బస్సు యాత్ర' రోడ్‌షో కొనసాగించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శనివారం విజయవాడలో జరిగిన రోడ్ షోలో గాయపడ్డారు. రోడ్‌షో సందర్భంగా కొందరు ఆకతాయిలు రాళ్లు విసిరారు. వాటిలో ఒకటి ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాకింది. జగన్ మోహన్ రెడ్డి ఎడమవైపు కన్నుపైన గాయమైంది. ప్రచారంలో ముఖ్యమంత్రి వెంట ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా గాయపడ్డారు.

సీఎం జగన్ బస్సులో వైద్యం చేయించుకున్న తర్వాత 'మేమంత సిద్దం బస్సు యాత్ర' రోడ్‌షో కొనసాగించారు. విజయవాడలోని సింగ్ నగర్‌లోని వివేకానంద స్కూల్ సెంటర్‌లో తన బస్సు యాత్రలో భాగంగా జనాలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎంపై రాయి తగిలిందని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలే ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Updated On 13 April 2024 7:10 PM GMT
Yagnik

Yagnik

Next Story