టీడీపీ(TDP) సర్వ నాశనం కావటానికి ప్రధాన కారణం లోకేష్‌(Nara Lokesh) అని మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) పేర్కొన్నారు. గుంటూరులో ఆయ‌న మాట్లాడుతూ.. టీడీపీని కాపాడటం ఎవరి వల్ల కాదన్నారు. ఈ క్ర‌మంలోనే చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై కూడా విమర్శలు చేశారు.

టీడీపీ(TDP) సర్వ నాశనం కావటానికి ప్రధాన కారణం లోకేష్‌(Nara Lokesh) అని మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) పేర్కొన్నారు. గుంటూరులో ఆయ‌న మాట్లాడుతూ.. టీడీపీని కాపాడటం ఎవరి వల్ల కాదన్నారు. ఈ క్ర‌మంలోనే చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై కూడా విమర్శలు చేశారు. బాబూకొడుకులిద్ద‌రూ వందల, వేల కోట్లు దోచుకున్నారని ఆధారాలున్నాయి కాబట్టే అరెస్టు చేశారని అన్నారు. టీడీపీపై, ఆ పార్టీ నేత‌ల‌పై కక్షసాధింపు అవసరం లేదన్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా గమనించి.. నోరు పారేసుకోకుండా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఏ బలం ఉందని టీడీపీకి మద్దతిస్తాడని ప్ర‌శ్నించారు. పెళ్ళికి వెళ్తూ పిల్లిని ఎవరైనా వెంటబెట్టుకొని వెళతారా అని ఎద్దేవా చేశారు.

బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చామని.. వేచి చూస్తే పార్టీలో అందరికీ పదవులు వస్తాయని అంబ‌టి రాంబాబు కార్య‌క‌ర్త‌ల‌తో అన్నారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని.. 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామని వెల్ల‌డించారు. అక్టోబర్ 26 నుండి బస్సు యాత్ర(Bus Yatra) చేస్తున్నామని తెలిపారు.

Updated On 11 Oct 2023 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story