జగన్ సక్సెస్ ఫుల్ సీఎం, చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని.. టీడీపీ, జనసేన ఇంకా సీట్లు కోసం కొట్టుకుంటున్నాయన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. మేనిఫెస్టోను […]

జగన్ సక్సెస్ ఫుల్ సీఎం, చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని.. టీడీపీ, జనసేన ఇంకా సీట్లు కోసం కొట్టుకుంటున్నాయన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుండి తొలగించిన చంద్రబాబును ప్రజలు నమ్మరని అంబటి విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామన్నారు.

సీట్లు రాని వారు ఏవేవో మాట్లాడుతున్నారన్నారని అంబటి అన్నారు. బాలశౌరి అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే అక్కడ పడ్డాడని ఆయన విమర్శించారు. అందరిని ముంచిపోయాడని ఆయన ఆరోపించారు. జగన్ అర్జునుడు.. అభిమన్యుడు కాదని.. ప్రతిపక్షాల పద్మ వ్యూహాలను ఛేదించి బయటకు వస్తాడన్నారు. సీట్లు అడుక్కోవడానికి చంద్రబాబు దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని ఆయన వెంట వెళ్లొద్దన్నారు. లోకేష్‌ను ఎక్కడ దాచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Updated On 5 Feb 2024 1:11 AM GMT
Yagnik

Yagnik

Next Story