నేడు ఏపీలోని ఎన్డీఏ కూటమి నేతలు భేటీ కానున్న‌ట్లు తెలుస్తుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం.

నేడు ఏపీలోని ఎన్డీఏ కూటమి నేతలు భేటీ కానున్న‌ట్లు తెలుస్తుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు, జ‌న‌సేన అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమావేశం అవ‌నున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రో నాలుగు రోజుల్లో వెలువ‌డ‌నున్న ఎన్నికల ఫలితాలపై ముగ్గురు నేతలు చర్చలు జరుప‌నున్నట్లు సమాచారం అందుతోంది. కౌంటింగ్ పై టీడీపీ ఇప్పటికే ఏజెంట్లకు శిక్షణ ఇచ్చింది. కౌంటింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు సూచనలు ఇచ్చారు. మ‌రో నాలుగు రోజులు ఫ‌లితాల‌కు స‌మ‌యం ఉన్నా.. కూటమి ప్రభుత్వం వస్తుందనే ధీమా చంద్రబాబు వ్య‌క్తం చేస్తున్నారు.

Updated On 30 May 2024 10:07 PM GMT
Yagnik

Yagnik

Next Story